తమ్మినేని కి జిపి జెఎసి వినతి

గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ జనగామ జిల్లా కమిటీ ద్వారా పాలకుర్తిలో వీరనారి ఐలమ్మ సభ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి వినతి పత్రాన్ని అందజేసినట్లు జేఏసీ జిల్లా చైర్మన్ రాపర్తి రాజు తెలిపారు
ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం గారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డిమాండ్లు పరిష్కరిస్తాం సమ్మె విరమించాలని చెప్పిన మంత్రి దయాకర్ రావు సమ్మె విరమించిన తర్వాత గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పట్టించుకోకుండా నాన్చివేత ధోరణి ప్రదర్శించడం సరైనది కాదని అన్నారు గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు తమ న్యాయమైనడిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని వారికి సిపిఎం పార్టీ అండగా ఉంటదని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ జిల్లా నాయకులు బస్వ రామచంద్రం సిఐటియు జిల్లా నాయకులు చిట్యాల సోమన్న కోడెపాక యాకయ్య వివిధ మండలాల జేఏసీ నాయకులు రాము ఉత్తపు ఐలయ్య గొడిశాల సోమయ్య చింత ఎల్లయ్య చింత వెంకన్న కొడకండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *