అంగన్వాడీల సమస్యలు పరిష్కరించ కుంటే ఉద్యమం ఉదృతం చేస్తాం
Jangaonసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలి. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలనీ, తదితర సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జనగామ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు అన్నారు.గురువారం రోజున సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రెండో రోజు సమ్మె చేస్తున్న అంగన్ వాడి టీచర్లు, ఆయాలు చేస్తున్న సమ్మెకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్, ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ,ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలి డిమాండ్ చేశారు. 2018 అక్టోబర్లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ.1,500/-లు, హెల్పర్లకు రూ.750/-లు,మినీ వర్కర్లకు రూ.1,250/-లు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్తో సహా చెల్లించాలనీ అన్నారు. 2017 నుండి టిఎ,డిఎ బకాయిలు మొత్తం చెల్లించాలనీ,దీనికి సరిపడా బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయాలి.3 సం॥రాల రేషన్ షాపు ట్రాన్స్ పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలనీ,పిఆర్సి ఎరియర్స్ 2021 జూలై, అక్టోబర్, నవంబర్ మూడు నెలలవి వెంటనే చెల్లించాలనీ డిమాండ్ చేశారు. అంగన్ వాడిలలో ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలనీ,ఈ సమస్య పరిష్కార కోసం తక్షణమే చర్యలు చేపట్టాలనీ,మదర్స్ కమిటీలకు చైర్మన్ గా తల్లులను మత్రమే నియమించాలనీ గ్రామ సర్పంచులను చైర్మన్ నియమాకం చేసే పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేశారు.ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు రూ.1.15 పై॥ల నుండి రూ.5/-లకు, గర్భిణీ/బాలింతలకు రూ.2.40 పై॥ల నుండి రూ.10/-లకు పెంచాలనీ డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలనీ ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లంటినీ మెయిన్ సెంటర్లుగా గుర్తించి అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలనీ కోరారు.2017 నుండి ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి.NHTS యాప్ ను పూర్తిగా రద్దు చేయాలి. కేవలం పోషన్ ట్రాకర్ మాత్రమే కొనసాగించాలనీ, అన్లైన్ పని చేయడానికి వీలుగా ఐప్యాడ్ అంగన్వాడీలకు ఇవ్వాలనీ అన్నారు.అంగన్వాడీ ఉద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు (ఈవెంట్స్) ఇచ్చే డబ్బులు రూ.250/- ల నుండి రూ.2,000/-లకు పెంచాలనీ రేషన్ బియ్యాన్ని శుభ్రపరిచిన వెహికల్ ద్వారానే సప్లై చేయాలనీ డిమాండ్ చేశారు.ఎండకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలనీ,జివో. నెం 14, 19, 8 లను వేంటనే సవరించి అంగన్వాడీ ఉద్యోగులకు ఆసరా, కళ్యాణ లక్ష్మి, తదితర ప్రభుత్వ సంక్షేమ పధాకలు అమలు చేయాలని డిమండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ జిల్లా కోశాధికారి సుంచు విజేందర్ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మచ్చ శారద సీఐటీయూ టౌన్ కమిటీ సభ్యులు కచ్చ గళ్ళ వెంకటేష్ అంగన్వాడీ యూనియన్ జిల్లా మండల నాయకులు రాజకల సౌందర్య రాజేశ్వరి కల్పన యాదమ్మ రజిత సుజాత విజయ రాణి నిర్మల కవిత అనిత రజిని తదితరులు పాల్గొన్నారు.