వినాయక చవితి నిమిత్తం ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల లో భాగంగా భక్తులకు విరివిగా ప్రసాదం (లడ్డు, పులిహోర, అన్నదానం) పంపిణీ చేశారు.ప్రసాద వితరణ కార్యక్రమంలో స్థానిక యువజన సంఘాలు, వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు, గణేష్ మండపాల వద్ద శ్రద్ధాభక్తులతో కూడిన వాతావరణం నెలకొంది.సాంస్కృతిక కార్యక్రమాలు, భజన బృందాల గానంతో ప్రసాద వితరణ ప్రత్యేక ఆకర్షణగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాధుని ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ – నగేష్ ముదిరాజ్ “ప్రతి భక్తుడు ఆనందంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో భాగస్వామ్యం కావాలని మా ఆకాంక్ష” అని తెలిపారు.