చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో ఈరోజు ఆర్ కొత్తగూడెం గ్రామం లో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం.

చర్ల లో 7వ తారీకున జరగనున్న ఎన్నికల సన్నాహక సమావేశానికి భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాతామధు మరియు భద్రాచలం నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన నున్నారు కావున బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపే లక్ష్యంగా చేసుకొని అత్యదిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో MPP కోదండరామయ్య, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు కాకి అనిల్, ఆర్ కొత్తగూడెం మాజీ సర్పంచ్ తుర్రం రవి, పార్టీ సీనియర్ నాయకులు SD అజీజ్, ఏనుటి జనార్దన్, సత్యనారాయణరాజు, వేములవాడ కృష్ణార్జునరావు, సినిగిరి మనోజ్ , ఏనుటి నాగేంద్ర, సిద్ది శ్రావణ్, సినిగిరి బన్ను, ఏనుటి ప్రవీణ్, మరియు పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పంజా రాజు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *