చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రహదారిని మూసి వేస్తున్నట్లు మోతుగూడెం ఎస్సై గోపాలరావు తెలిపారు. మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో పాటు మరో మూడు రోజులు పాటు తుపాన్ ఉన్న నేపథ్యంలో ఘాట్ రహదారిలోని కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉన్నందును ప్రస్తుతం ఘాట్ రహదారి మూసి వేయడం జరుగుతుందన్నారు. ఏ ఒక్క వాహనం ఘాట్ రహదారిలో అనుమతించబడవు అని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని రాజమండ్రి వైపు వెళ్లే ప్రయాణికులు చింతూరు వైపు వచ్చే ప్రయాణికులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఘాట్ రహదారిలో మళ్ళీ ప్రయాణాలు పునరుద్దించే విషయం తెలియజేస్తామన్నారు.