తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని, జిల్లా పార్టీ కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్న సందర్భంగా నేడు ప్రారంభోత్సవ ఏర్పాట్లను, సీఎం రాక సందర్భంగా వసతులను, హెలిప్యాడ్ నిర్మాణాన్ని *రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు*, గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపి శ్రీమతి మాలోతు కవిత, జెడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలిసి పరిశీలించారు. పనుల పురోగతి, ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు.మంత్రులతో పాటు కలెక్టర్ శశాంక స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు ఉన్నారు.