సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం

రాష్ట్రంలో రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 18న క్యాబినెట్ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సచివాలయంలోని మూడో అంతస్తు సమావేశ మందిరంలో గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డిలు మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్ష్యతన జరిగిన సమావేశానికి హాజరయ్యారు.

యాసంగి పంటకాలం మూడు నుండి నాలుగు వారాలు ముందుకు జరపడం మూలంగా అకాల వర్షాల నుండి రైతులు పంట నష్టపోకుండా కాపాడడం, మార్చి నెలాఖరు వరకు యాసంగి పంట కోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యం చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *