సోమవారం జరిగే గిరిజన దర్బార్ రద్దు
భద్రాచలం: మిలాద్ ఉన్ నబీ (పండుగ) సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జరిగే గిరిజన దర్బార్ రద్దు చేసినట్లు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబి (పండుగ) ఉన్నందున ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండని కారణంగా గిరిజన దర్బార్ రద్దు చేయడం జరిగిందని, గిరిజనులు ఇట్టి విషయాన్ని గమనించి అర్జీలు సమర్పించడానికి భద్రాచలం లోని ఐటీడీఏ కార్యాలయంకు రావొద్దని ఆయన తెలిపారు.