ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే డిసెంబర్ 13 నుండి 16 వరకు ఎస్.ఎఫ్.ఐ జాతీయ మహాసభలను విజయవంతం చేద్దాం..

ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వడ్రనఖమ్మం :- ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్.ఎఫ్.ఐ జాతీయ మహాసభల వాల్ పోస్టర్ ను ఏ ఎస్ ఆర్ కాలేజీలో ఆవిష్కరణ… ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వడ్రనపు మధు మాట్లాడుతూ :- ఎస్.ఎఫ్.ఐ 17 జాతీయ మహాసభలకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి 800 లకు పైగా విద్యార్థి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ మహాసభలో నాలుగు రోజుల పాటు దేశంలోని విద్య, ఉపాధి, ఇతర రంగాల గురించి లోతైన చర్చ జరుపనున్నారు. విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మౌలిక సదుపాయాలు, ప్రొఫెసర్ల కొరత, ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి, పైన భవిష్యత్తు ఉద్యమాన్ని కార్యచరణ రూపొందిస్తారు. ఈ మహాసభల సందర్భంగా విద్యార్థులతో భారీ బహిరంగ సభను ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా త్రిపుర రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, హాజరవుతారు.. కావున విద్యార్థులు పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలిపిస్తున్నాము.. ఈ మహాసభలకు విద్యార్థులు, యువకులు, మేధావులు, ప్రొఫెసర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు.. ఈ కార్యక్రమం జిల్లా సహాయ కార్యదర్శి పోనుకుల సుధాకర్, ఖమ్మం నగర కన్వీనర్ తరుణ్, ASR కాలేజీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, శ్రీకాంత్, గర్ల్స్ కన్వీనర్ వినీల, అనిత, నిహారిక, రాజేశ్వరి, రాజు గోవర్ధన్ నితిన్ తదితరులు పాల్గొన్నారు…

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *