సర్వేల పేరుతో కాలయాపన -లబ్ధిదారులకు న్యాయం చేయాలి
Uncategorizedగత 23వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు మూడో విడత లబ్ధిదారులు నిరసన చేస్తున్న ప్రభుత్వానికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని కాలయాపన చేస్తే సహించేది లేదు అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల పోరాట సంఘం కళ్యాణం లింగం అన్నారు. సోమవారం రోజున చిట్యాల ఐలమ్మ నగర్ డబల్ బెడ్ రూమ్ ల వద్ద మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంఘం అధ్యక్షుడు కళ్యాణం లింగం దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వే పేరుతో కాలయాపన చేస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వం 2012 -13 సంవత్సరంలో మూడో విడత ఇందిరమ్మ పథకం ద్వారా పట్టాలిచ్చి స్థలాలు చూపించడం మరిచారని నేటి తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన వాళ్లకు 6 నెలల్లోడబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసి నేటికీ ఐదు సంవత్సరాలు కావస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం పేదల పట్ల జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి చిత్తశుద్ధి లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిని ఇదే సందర్భంలో సర్వే చేయడం మోసం చేయడమే అని ఆమె అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కొన్ని శాంత కొలిపాక వెంకటలక్ష్మి ఏనుగుల కమల తిప్పారపు తులసి యాదమ్మ వెంకటేష్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.