పాల్వంచలోని మహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకగురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, వసతి గృహ పరిసరాలను విద్యార్థుల అందిస్తున్న ఆహారపు మెనూను పరిశీలించారు. వసతి గృహ పరిసరాలుఅపరిశుభ్రతపై ప్రిన్సిపాల్, వార్డెన్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లైట్లు కూడా సరిగా లేవని,ఇంతఅపరిశుభ్రత ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహ నిర్వహణపై ఆర్ సి ఓ తో ఫోన్లో మాట్లాడి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని, ఆర్సిఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని ఇంత అపరిశుభ్రత నెలకొంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని విద్యార్థులు చదువుకోడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందని ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహార అందించడం లేదని గమనించిన కలెక్టర్ ప్రిన్సిపాల్ , వార్డెన్ కు షో కాజ్ నోటీస్ జారీ చేయాలని ఆర్సీఓ ను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని మళ్లీ తాను పరిశీలకొస్తానని అప్పట్లోగా మార్పు రాకపోతే విధుల నుంచి సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు.