దర్బార్ కి యూనిట్ అధికారులు పాల్గొనాలి --- ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ భద్రాచలం: సెప్టెంబర్ తేదీ సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని ఆయన తెలుపుతూ సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.