
ఈ69న్యూస్ జఫర్ఘడ్
ఈనెల 27న మండల తహసిల్దార్ కార్యాలయాల ముందు సిపిఎం మండల కమిటి ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి, మండల నాయకులు గుండెబోయిన రాజు వడ్లకొండ సుధాకర్లు ప్రజలకు పిలుపు నిచ్చారు.మంగళవారం రోజున మండలంలోని షాపెల్లి గ్రామంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గుండెబోయిన రాజు,వడ్లకొండ సుధాకర్లు మాట్లాడుతూ..జిల్లా పార్టీ పిలుపులో భాగంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో స్థానిక సమస్యలు సర్వే చేయడం జరుగుతుంది గ్రామాలలో సర్వే చేస్తున్న సందర్భంలో సర్వే బృందానికి అనేక స్థానిక సమస్యలు ప్రజల నుండి రావడం జరిగింది.అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క గ్యారెంటీ పూర్తిచేసిన పాపనా పోలేదని ఇందిరమ్మ ఇండ్లు రైతుబంధు రైతు రుణమాఫీ గ్యాస్ సబ్సిడీ ఉచిత కరెంటు రేషన్ కార్డులు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సర్పంచుల పదవులు పూర్తయి స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కరించడం కోసం కృషి చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాలను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఎండిపోయిన వరి మొక్కజొన్న ఇతర పంటలకు ఎకరానికి 50 వేల రూపాయల నష్టపరిహారం రైతులకు చెల్లించి ఆదుకోవాలని అన్నారు.గ్రామాల్లో పేరుకుపోయిన స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదని కావున ప్రజలందరూ 27న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజలను కార్యకర్తలను వారు కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి షబానా నక్క యాకయ్య ముక్కెర రాజు వడ్లకొండ రాజు రమేష్ ఏర్పుల పెదరాములు చిన్న రాములు రాపర్తి రజిత రాపర్తి లక్ష్మి చొప్పరి వెంకటమ్మ చిలువేరి మల్లేశం ఎండి శంషొద్దీన్ కొంతం అంజయ్య అవధూత రాజు తదితరులు పాల్గొన్నారు.