
telugu galam news e69news local news daily news today news
భద్రాచలం 29 జనవరి 24 ఈరోజు జరిగిన గిరిజన దర్బార్ లో పూనెం భద్రమ్మ దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామమునకు చెందిన ఆమె కంటి వైద్యం కోసం అభ్యర్థించగా ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ గారు వైద్యులతో మాట్లాడి తన సొంత వాహనంలో భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు పంపించడం జరిగినది. హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ పర్యవేక్షణలో నూతనంగా ఏర్పాటుచేసిన కంటి వైద్యశాల డాక్టర్ సంతోష్ పూనం భద్రమ్మకు కంటి పరీక్షలు నిర్వహించి వచ్చేనెల ఫిబ్రవరి 2 వ తేదీన కంటి ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు.