
ఈ69న్యూస్ వరంగల్
నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి అందిస్తే నీవు ఒరగబెట్టిందీ ఏమీ లేదని మంత్రి కొండా సురేఖ పై బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు.ఎంజీఎం దయనీయస్థితిపై వరంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం పేరుతో బుధవారం ఎంజీఎం ఆస్పత్రి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా రవి కుమార్ మీడియాతో మాట్లాడారు.ఎంజీఎంలో కనీసం వీల్చైర్లు,స్ర్టేచర్లు,బెడ్లు,ఆక్సీజన్,2డీ,ఈసీజీ లాంటి మౌలిక వసతులు కూడా లేవని విమర్శించారు.వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా ఏం లాభం లేదంటూ మండిపడ్డారు.సీఎం వద్దకు వెళ్లి పేదల ఆస్పత్రి అయిన ఎంజీఎం దుస్థితి గురించి వివరించలేని దద్దమమ్మలు అంటూ ధ్వజమెత్తారు.స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన సురేఖ ఒక్కరోజైనా ఆస్పత్రి గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు.ఆమెకు కావాల్సింది ఓట్లు,రాజ భోగాలు మాత్రమేనని,ప్రజలకు ఏమైనా ఆమెకు పట్టదని,అవసమైతే తప్ప గడి నుంచి బయటకు రారని ఆరోపించారు.రేవంత్ సర్కారు అన్ని విధాలా విఫలమైందని దుయ్యబట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మారుతినేని ధర్మారావు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు,రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్,కంభంపాటి పుల్లారావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్,రత్నం సతీష్,వన్నాల వెంకటరమణ,చాడ శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరి శంకర్,డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు రాష్ట్ర,జిల్లా నాయకులు వివిధ మోర్చాల నాయకులు,రాష్ట్ర,జిల్లా పదాధికారులు,మండల అధ్యక్షులు,డివిజన్ అధ్యక్షులు,కార్యకర్తలు,మహిళలు,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
