తెలుగుగళం న్యూస్, పామిడి. పామిడి పట్టణంలోని అనఘాత్రేయ దత్త పాదుక క్షేత్రంలో నవగ్రహ ప్రతిష్ఠ అనంతరం మండల పూజాజర్యక్రమాలు గురువారం చేపట్టారు. గణపతి పూజ,అనఘా దేవి దత్తత్రేయ, పూజలు నవగ్రహ విశేష అభిషేక అష్టోత్తరపూజలు, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గోపుర కళషకుంభభిషేకం అనంతరం నవగ్రహ శాంతి హోమము, పూర్ణహుతి గావించి తీర్థప్రసాదాలు అందించారు. మైసూర్ నుండీ వచ్చిన దత్త శంకరస్వామి ఆధ్వర్యంలో ఈపూజలు చేశారు. ఎన్ ఎస్ ఏం శ్రీధర్, లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం చేశారు. అన్నదానం చేశారు.