
ఈ69న్యూస్ వరంగల్
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ లో నందనం భారతమ్మ(65)అనే వృద్దురాలు 3లక్షల రూపాయలు విత్ డ్రా చేసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి తన వాహనం పై మీ ఇంటివద్ద దింపుతా అంటూ మాయమాటలు చెప్పి స్కూటీ ఎక్కించుకొని ఫిరంగడ్డ వైపు ఆపి దింపి డబ్బులు సంచి తీసుకొని వెళ్లడం తో మహిళా పోలీసులను ఆశ్రయించగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మురం చేసి.సీసీ కెమెరాల ఆధారంగా దొంగ చిత్రాన్ని విడుదల చేసి పట్టించిన వారికి 10,000 వేల(పదివేల)నజరానా ప్రకటించి వారి పేర్లను గోప్యంగా ఉంచబడును అని వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు.