నవయుగ వైతాళికుడు లూయిస్ బ్రెయిలి
ఫ్రెంచ్ విద్యావేత్త, అంధుల కోసం ప్రత్యేక లిపి సృష్టికర్త, ప్రపంచంలోని అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించి, అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప దర్శినికుడు లూయీస్ బ్రెయిలీ.
ప్రాన్స్ లోని క్రూవె అనే గ్రామంలో మేనిక్ బ్రెయిలీ, సైమన్ రేనే బ్రేయిలి దంపతులకు 1809 జనవరి 4 న లూయిస్ బ్రెయిలి జన్మించాడు. బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా అంధునిగా మారినారు. పారిస్లో 1784లో వాలెంటైన్ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్ చదువు కోవడానికి వెళ్ళాడు. బ్రెయిల్ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడడం అతని తెలివితేటలకు నిదర్శనం.పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై నిరంతరం కృషిచేసాడు. అంధుల కోసం పుస్తకాలు ప్రింటు చేయడానికి వస్తున్న ఆటంకాలను అడదిగమించేందుకు,స్పర్శ ఆధారంగా ప్రింటింగు విధానం వుండాలని గ్రహించి, అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా వుంటే చదవటం తేలిక అని బ్రెయిల్ భావించారు.1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు. దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.
అంధులు చదువుకోవాలంటే స్మర్శ తప్ప మరో మార్గం లేదని భావించి ఎత్తుగా ఉబ్బివుండే విధంగా అక్షరాలుఉన్న పుస్తకాలు కావాలని నిర్ణయానికి వచ్చారు. స్పెయిన్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ 16వ శతాబ్దంలో చెక్కమీద ఎత్తుగా ఉబ్బివుండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొందించాడు.అంధులు చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు ఎలా ప్రింటు చేయాలెనో అనే విషయంలో ఎక్కువ కృషి చేసింది కూడా అంధులే కావడం వారి పట్టుదలకు నిదర్శనం.పారదస్ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతని మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం రూపొందించారు. 1784లో ఇది కనుగొన్న ఘనత బ్రెయిలీకి దక్కింది. 20 సంవత్సరాల యువకుడైన బ్రెయిల్ తాను సిద్ధాంతీకరించిన నూతన పద్ధతిపై 5 సంవత్సరాల పరిశోధన చేసి సంపూర్ణత సాధించాడు. ఆరు చుక్కలను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల బ్రెయిలీ మొత్తం అక్షరాలను రూపొందించాడు. ఇది విప్లవా త్మకమైన మార్పు, ఆరుపాయింట్లు వివిధ రకాలుగా వాడి మొత్తం ఇంగ్లీషు అక్షరాలన్నీ పలికేటట్లు చేశాడు. ఒక చుక్కనుండి ఆరు చుక్కలలోనే మొత్తం అక్షరాలన్నీ తయారు చేశాడు.
ఈ నిరంతర శ్రమవల్ల 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చి బ్రెయిలీని తమ దేశపు ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్.ఈ రోజు ప్రపంచ అంధులకు అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసుల్లో, వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రెయిలీ.
బ్రెయిలీ 1852 జనవరి 6 న 43 సంవత్స రాల పిన్న వయస్సులోనే మరణించాడు..బ్రెయిలీ మరణ శతాబ్ది సందర్భంగా 1952లోఅతని అస్తికలను పారిస్లో పాంథియన్లోకి మార్చి విశిష్ఠ వ్యక్తిగా అతనిని గౌరవించారు. బ్రెయిలీ 200 జన్మదినో త్సవం సందర్భంగా 2009లో ప్రపంచవ్యాప్తంగా అతనిని కీర్తించారు. బెల్జియం, ఇటలీ బ్రెయిలీ బొమ్మతో రెండు యూరోల నాణాన్ని విడుదల చేశాయి. మన భారతదేశం బ్రెయిలీ గౌరవార్థం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో విడుదల చేసింది. అదే విధంగా అమెరికా ఒక డాలరు నాణాన్ని విడుదలచేయడం అపూర్వం, అంధులకు విద్యాదానం చేసిన మహనీయుడు బ్రెయిలీ చిరస్మరణీయుడు.