
telugu galam news e69news local news daily news today news
-తీన్మార్ మల్లన్న
గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్
ఓటు హక్కు ఉన్న పట్టభద్రులు మరలా ఓటు హక్కు ప్రెష్ గా చేసుకోనే విధంగా వీరితో పాటు కొత్త పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునే విధంగా కోఆర్డినేట్ చేయాలని తీన్మార్ మల్లన్న అన్నారు.
శనివారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి సింగపురం ఇందిరా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు..వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు చివరి గడువు తేది సమీపిస్తునందున
నియోజక వర్గంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పట్టభద్రులు,కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులతో ఓటు నమోదు చేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,నియోజక వర్గ నాయకులు,మండల నాయకులు పాల్గొన్నారు.