రజక వృత్తిదారులకు ఋణాలు ఇవ్వాలి
Hyderabad, .. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ 4వ మహాసభలో ఫైళ్ళఆశయ్య రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రజకవృత్తిదారుల వృత్తిదారుల సంఘం డిమాండ్… తేదీ:18-12-2022( ఆదివారం) రోజున నగర అధ్యక్షులు సి.వెంకటస్వామి అద్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రం దోడ్డికోమరయ్య హాల్ లో నగర 4వ మహసభ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది రజక వృత్తిదారులు ఉన్నారని 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో రజకులు ఆర్థిక ,సామాజిక, రాజకీయ రంగంలో తీవ్రంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రజక ఫెడరేషన్ ద్వారా ప్రతి వృత్తిదారుడికి రెండు లక్షల రుణం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని డివిజన్ ల్లో మోడ్రన్ దోబీ ఘాటు నిర్మించాలని,ఉచిత విద్యుత్తు పథకాన్ని ఎల్. టి 4లో చేర్చి అదనపు చార్జీలు పడకుండా చూడాలని కోరారు. వేలాదిమంది రజకులు అపార్ట్మెంట్ వాచ్మెన్ గా, లాండ్రి షాపులు ఏర్పాటు చేసుకొని జీవితాలు వెలదీస్తున్నారని ప్రభుత్వం వీళ్ళందరికీ డబల్ బెడ్ రూమ్ అందించాలని 50 ఏళ్లు నిండిన వారికివృద్ధాప్య పెన్షన్లు, రక్షణ చట్టం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రజకవృత్తిదారుల సంఘం నగర కార్యదర్శి జి నరేష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి కోల్పోయి పట్టణాలకు వలస పోతున్నారని వారందరికీ ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నగరంలో ఉన్నదో దోబీఘట్లున్నిటిని మెడ్రన్ చేయాలని 9 తీర్మానాలని ప్రవేశపెట్టారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్యోతి ఉపేందర్ రాష్ట్ర కమిటీ సభ్యులు యం.గోపాల్ ,యాదమ్మ , నాగేష్, సోషల్ మీడియా నగర కన్వీనర రాపర్తి ప్రభాకర్,యం,రమేష్ ,లోంకా సోమయ్య ,కె స్వామి,జి బిక్షపతి, కెయాదగిరి, లక్మయ్య , రాజు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు: జి.నరేష్ నగర ప్రధాన కార్యదర్శి,TRVS..