
భూక్యా చందు నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఈ69న్యూస్ జనగామ
ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతాంగానికి ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో నిన్న శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నేరవేర్చేవిధంగా లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీఅభిప్రాయపడుతున్నది.ఈ బడ్జెట్ను సవరించి రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నది.2025-26లో వ్యవసాయ రంగానికి రూ.18,101 కోట్లు, పశు సంవర్ధనకు రూ.1,657 కోట్లు, సహకార రంగానికి రూ.158 కోట్లు,అడవుల పెంపకానికి రూ.1,022 కోట్లు మరియు నీటిపారుదల శాఖకు రూ.23,330 కోట్లు కేటాయించారు.గత సంవత్సరం వ్యవసాయ రంగానికి మాత్రమే రూ.33,493 కోట్లు కేటాయింపు చేశారు.ఈ బడ్జెట్ను బట్టి రుణమాఫీ కాని రైతులకు ఇక మాఫీ అయ్యే అవకాశం లేదని గుర్తించాలి.2024-25 బడ్జెట్లో రుణమాఫీకి రూ.15,470 కోట్లు కేటాయించి,రూ.10,611.88 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.ఈ బడ్జెట్ను పరిశీలిస్తే రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి,ఉత్పాదకతకు ప్రోత్సాహం ఇవ్వలేదు.హార్టికల్చర్ అభివృద్ధికి కేటాయింపులు లేవు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం కూరగాయలు,పప్పులు,ఉల్లి,వంటనూనెలు,పంచదార దిగుమతులు చేసుకుంటునది.యాంత్రీకరణకు రూ.25.47కోట్ల కేటాయింపు చూస్తేనే యాంత్రీకరణను ప్రోత్సహించేలా కనబడడంలేదు.రైతు భరోసా కింద రూ.13,603కోట్లు కేటాయింపు చూపారు.2024 వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు.యాసంగి పంటల కోత కాలం దగ్గరకు వచ్చినా నిధులు అందరికీ అందలేదు. రాష్ట్రంలోని వ్యవసాయ పరిశోధనల కేంద్రాలకు కేటాయింపులు లేవు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కి గత బడ్జెట్ లో రూ 18.75 కోట్లు కేటాయించి రూ.4.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ కి గత బడ్జెట్ లో రూ 4.37 కోట్లు కేటాయించి రూ.1.09 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.జాతీయ ఆహార భద్రత,నూనెగింజల అభివృద్ధి వ్యవసాయ విస్తరణ రాష్ట్రీయ క్రిషీ వికాస్ యోజనలకు కేటాయింపులు లేవు.ఆయిల్ పామ్ తోటల అభివృద్ధి గురించి విస్తృత ప్రచారం చేసినా ప్రభుత్వం అందుకు తగిన నిధులు కేటాయించలేదు.క్రిష్ణా,గోదావరి నదులపై ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కోరుతున్నాము.రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు.ఈ బడ్జెట్లో ఆ ప్రస్తావనేలేదు.రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేయాలి.నాణ్యతలేని,కల్తీ విత్తన వ్యాపారాన్ని అడ్డుకొని నాణ్యత గల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించే విధంగా నిధులు కేటాయించాలి.వ్యవసాయ,హార్టికల్చర్,విశ్వ విద్యాలయాలకు పరిశోధనల కోరకు బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి.సన్న,చిన్న కారు రైతులకు పంటల భీమా పథకానికి రూ.981.11కోట్లు మాత్రమే కేటాయించారు.గత సంవత్సరం కేటాయించినా రూ.981 కోట్లలో ఒక్కరూపాయి ఖర్చు చేయలేదు.యేటా రూ.4,500ల కోట్లు విలువ గల పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతున్నారు.రైతుల భీమాకు మాత్రం రూ.1,167.92కోట్లు మాత్రమే కేటాయించారు.రైతు భీమా పథకాన్ని 18-59 సంవత్సరాలను 18-65 సంవత్సరాలకు పెంచాలి. అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించడానికి రాష్ట్రంలో ‘‘ధరల నిర్ణాయక కమీషన్’’అన్ని పంటలకు ధరలు నిర్ణయించి మార్క్ఫెడ్,సివిల్ సప్లయిస్ ద్వారా కొనుగోలు చేయాలి.ఇందుకు మార్కెట్ జోక్యం పథకం కింద కనీసం రూ.3000ల కోట్లు బడ్జెట్లో కేటాయించాలి.పై సూచనలను అమలు జరిపే విధంగా బడ్జెట్ను సంవరించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.