వరద కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలింపు
వర్ధన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు విశ్రాంతి ఐపిఎస్ అధికారి
కెఆర్ నాగరాజు ఆదేశానుసారం
మరియు మండల అధ్యక్షులు సమ్మెట మహేందర్ గౌడ్ సూచనల మేరకు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం
ఒంటిమామిడిపల్లి గ్రామంలో శిధిలావస్థలో ఉన్న ఇండ్లను పరిశీలించి నష్టం జరిగిన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామపార్టీ అధ్యక్షులు
గిర్క రాజు సెక్రెటరీ వేణుగోపాల్ గ్రామ సిబ్బంది, గ్రామ నాయకులు పాల్గొన్నారు.