ఈ69న్యూస్ న్యూ దిల్లీ/వరంగల్ బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శనీయుడని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కొనియాడారు.ఢిల్లీలో సర్వాయి పాపన్న 315వ వర్ధంతి సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ,బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్వాయి పాపన్న అని కీర్తించారు.సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా,గీత కార్మికుడిగా కొనసాగిన తన ప్రస్థానంలో అణచివేత,వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడు పాపన్న అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి,చమాల కిరణ్ కుమార్ రెడ్డి,పోరిక బలరాం నాయక్,రఘురాం రెడ్డి,గడ్డం వంశీకృష్ణ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.