
*ఆపాలి* *రవాణా రంగ సమస్యలను పరిష్కరించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి**తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్(AIRTWF-CITU) జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్*స్పెషల్ డ్రైవ్ పేరుతో రవాణారంగ కార్మికుల దగ్గర అధిక పెనాల్టీల వసూలు ఆపాలని తెలంగాణ పబ్లిక్& ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్ డిమాండ్ చేశారు. గురువారం రోజున పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆటో కార్మికులతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా సుంచు విజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది రవాణా రంగ కార్మికులు రవాణా రంగంలో పనిచేస్తున్న వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదాని,కేంద్ర ప్రభుత్వం వెంటనే రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు.కార్మికులకు నష్టదాయకమైన ఏ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని నిండు అసెంబ్లీలో సభలో ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, MV యాక్ట్ 2019 చట్టం రాకముందే 2017 అక్టోబర్ లో జీవో ఎంఎస్ నెంబర్ 26న విడుదల చేసి 12 పాయింట్ల పద్ధతిని అమలు చేసి వేల సంఖ్యలో లైసెన్సులు రద్దు చేశారు, వందల సంఖ్యలో కార్మికుల జీవితాలపై దెబ్బ కొట్టడం జరిగింది , మళ్లీ ఒక రకంగా డ్రైవర్ వృతిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నటువంటి కుటుంబాలను ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ పేరుతో , అధిక పెనాల్టీలను నిర్ణయించడం సరైన పద్ధతి కాదు, ప్రభుత్వాలు డ్రైవర్ల సమస్యలను పరిష్కారం చేయకుండా కొత్త కొత్త జీవోలను తీసుకొస్తూ, చిన్న చిన్న కారణాలను చూపి సిగ్నల్ దాటిన, ఓవర్ లోడ్, వాహనం లైట్ వెలగకపోయినా, డ్రైవర్ యూనిఫామ్ వేసుకోకపోయినా, లైసెన్స్ రెన్యూవల్ లేకపోయినా ,ఫిట్నెస్, ఇన్సూరెన్స్ రోడ్డు ట్యాక్సీ లేకపోయినా వేల సంఖ్యలో జరిమానాలు విధిస్తున్నారు, వాహనాల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతావుంది కానీ రోడ్లు విస్తరణ పెరగడం లేదు, రోడ్ల నియమాల గురించి ప్రజలకు కార్మికులకు ఎలాంటి అవగాహన ప్రభుత్వం కల్పించడం లేదు, రహదారుల పైన ఎల్టర్ను, యూటర్న్ క్రాసింగ్ వద్ద డ్రైవర్ కు అప్రమత్తం చేయడానికి ఎలాంటి గుర్తింపు బోర్డులు లేవు కానీ స్పెషల్ డ్రైవ్ పేరుతో అధిక పెనాల్టీలు వేయడం కోసం ప్రభుత్వం అతి ఉత్సాహం చూపుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం కాబట్టి తక్షణమే ఈ యొక్క mv యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులను ఆపాలని, అధికారుల వేధింపులను ఆపాలని స్పెషల్ డ్రైవ్ తో అధిక పెనాల్టీలను తగ్గించాలనిడిమాండ్ చేశారు. రానున్న కాలంలో డ్రైవర్ల అందరిని కూడా ఐక్యం చేసి ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కమిటీ కోశాధికారి బూడిద ప్రశాంత్, సభ్యులు చీర శ్రీనివాస్ బొరిల్లి విజయ్,కంకర కోటి, md కరీం అంజిరెడ్డి,కుకట్ల ముత్తయ్య. తదితరులు పాల్గొన్నారు