
ఈ69న్యూస్ హన్మకొండ:-హనుమకొండ నగరంలోని వడ్డేపల్లి లోని ఎన్జీవోస్ కాలనీలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను మూసివేయాలని స్వేరో స్టూడెంట్ యూనియన్ (యస్.యస్.యూ)మరియు బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హన్మకొండ మండల విద్యాధికారి కి వినతిపత్రం సమర్పించారు.హనుమకొండ కిషన్ పురలో శ్రీ చైతన్య పాఠశాల నడుపుతూ అకాడమిక్ ఇయర్ మధ్యలో తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అకాడమిక్ ఇయర్ మధ్యలోనే ఆకస్మాత్తుగా పాఠశాలను హన్మకొండ పెట్రోల్ పంపు నుండి వడ్డేపల్లి ఎన్జీవోస్ కాలనీకి మార్చినారని అసలు అకడమిక్ ఇయర్ మధ్యలో పాఠశాలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడం అనేది ప్రభుత్వ విద్యాశాఖ నియమ నిబంధనలకు విరుద్ధమని దానికి విరుద్ధంగా పాఠశాలను తరలించారని అది ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నదని దానికి ఎలాంటి గ్రౌండ్ లేదని ఎలాంటి బోర్డు లాంటివి లేకుండా నిర్వహిస్తున్నారని అనుమతి ఉందని చెప్పేసి తల్లిదండ్రులను మోసం చేస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య పాఠశాలలను మూసివేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని ముందు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.