రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ప్రభుత్వం ఆమోదితం చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని ఏపియం అలువెలి మంగమ్మ అన్నారు. శుక్రవారం మరిపేడ మండల కేంద్రంలోని తాళ్ల ఊకల్ గ్రామం లో చామంతి గ్రామీక్య సంఘo ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని, గుండేపూడి గ్రామం లో స్వయం కృషి గ్రామీక్య సంఘo, తండా ధర్మారం గ్రామం లో షిరిడీ సాయి బాబా కొనుగోలు కేంద్రాo సెంటర్ల ను ప్రారంభించారు. ఈ మేరకు ఎపియం మాట్లాడుతూ దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం నుంచి ప్రకటించిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధరతో పాటు 500 బోనస్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. వరి కి మద్దతు ధర రూ.2,389 రూ/- లు సాధారణ రకం 2369 రూ/- లకు కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే విక్రయించుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన సన్న వడ్లకు ప్రభుత్వం ₹500 అదనంగా బోనస్ అందిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈఓ సైదమ్మ, సిసి శ్రీనివాస్ , చందు లాల్ , శ్రీరాములు, కేసముద్రం మార్కెట్ డైరెక్టర్ గడ్డం వెంకట్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సూరబోయిన ఉప్పలయ్య, పులుసు మల్లేశం, పెద్దపులి శ్రీనివాస్, గుండ గాని మధుసూదన్, కందల రమేష్, గుండెపుడి గ్రామ స్వయంకృషి గ్రూప్ సభ్యులు సైదమ్మ, మంజుల, ఉమా, తాళ్ల ఉక్కల్ చామంతి గ్రూప్ సభ్యులు, మామిళ్ళ ఉమారాణి, జ్యోతి, సుభద్ర, తండ ధర్మారం శిరిడి సాయిబాబా గ్రూప్ సభ్యులు బుజ్జమ్మ,నాగమణి,రైతులు లింగన్న, గణేష్,పెద్ద వెంకన్న,రాజు,బోడ పట్ల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.