
ఈ69న్యూస్,పరకాల ఆగస్టు 26
పరకాల అమరధామంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నాగారం,ఊరుకొండ సెక్టార్లకు చెందిన సుమారు 70 మంది అంగన్వాడీ టీచర్లు,హెల్పర్లు సిఐటియులో చేరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ సమక్షంలో వారు సభ్యత్వం పొందారు.ఈ సందర్భంగా రాగుల రమేష్ మాట్లాడుతూ..అంగన్వాడీలను కేంద్ర ప్రభుత్వం 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ నిధులను క్రమంగా తగ్గించడం ద్వారా కేంద్రం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆయన విమర్శించారు.ప్రీ ప్రైమరీ,పీఎం శ్రీవిద్యలను ఐసిడిఎస్ సెంటర్ల ద్వారానే నిర్వహించాలని కోరారు.అంగన్వాడీలపై అదనపు పనుల భారం మోపకూడదని,వారికి కనీసం ₹26,000 వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సిఐటియు అంగన్వాడీ యూనియన్ నాయకులు కాసం లీలావతి,దుర్గం రజిత,ఎస్.కోమల,బి.భాగ్యలక్ష్మి,కే.కోమల,జి.సుజాత,జి.విజయ,కే.కొమురమ్మ, జి.నిర్మల తదితరులు పాల్గొన్నారు.