రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 ఆర్థిక సాయం అందజేసిన
Suryapetమునగాల గౌడ సంఘం నాయకులు
మునగాల మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి పడిపూజకు వెళ్లి వస్తూ గత నెల 12వ తారీకు ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన మృతి చెందిన కుటుంబాలకు గురువారం మునగాల గౌడ సంఘం నుండి 1,50,000 ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ దైవదర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదం జరగటం దురదృష్టమని ఇలాంటి సంఘటనను మరల జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని క్షతగాత్రులకు దాతృ హృదయంతోటి ముందుకు వచ్చి ఇంకా సహకారం అందించే వారు అందించాలని వారు కోరారు ప్రమాదంలో మరణించిన గౌడ కులస్తులు ఇద్దరికీ కలిపి 50 వేల రూపాయలు, ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన వారికి లక్ష రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో,నారగాని వెంకయ్య ,నారగాని వెంకన్న, గండు అంజయ్య, మామిడి శ్రీనివాస్ ,బట్టిని చంద్రం, కీర్తి రామస్వామి, కుక్కడపు లక్ష్మయ్య, కొండా రామాంజనేయులు, అనంతుల సత్యం, నారగాని పరుశరాములు, అమరగాని వెంకటేశ్వర్లు ,అనంతుల శ్రీను, మండవ శ్రీను యారగాని వెంకన్న, నారగాని రాంబాబు, బత్తిని సాయి, కప్పల చంద్రం, అమరగాని శ్రీను, గుండు నాగేశ్వరరావు, దొమ్మేటి శ్రీను, కట్టెకోల బజార్ బాబు, అనంతు భిక్షం, కాసాని వీరయ్య, వత్సవాయి రాము,మండవ శ్రీను, గుండు శ్రీరాములు, గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు.