పర్వతాల శివాలయం పునః ప్రతిష్ట ఘనంగా చేస్తున్నాం
Uncategorizedమన చరిత్రను కాపాడే గొప్ప దైవ కార్యక్రమం
భక్తులకు అన్ని వసతులు ఏర్పాట్లు చేయాలి
గుడి పునః ప్రతిష్ట సమీక్ష సమావేశంలో మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరురి రమేష్
(పర్వతగిరి, జనవరి 23)
కాకతీయులు కట్టించిన గుడిని పునః ప్రతిష్టాపన చేసి మన చరిత్రను కాపాడే పవిత్ర కార్యాన్ని ఈ నెల 26,27,28 తేదీల్లో పర్వతగిరిలో గొప్పగా నిర్వహిస్తున్నామని, ప్రజలు, భక్తులు భారీ ఎత్తున తరలి రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆరురి రమేష్ గారు విజ్ఞప్తి చేశారు.
పర్వతాల శివాలయం పునః ప్రతిష్ట కార్యక్రమంపై నేడు పర్వతగిరిలో సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు.
ఈ నెల 26,27,28 తేదీల్లో పర్వతాల శివాలయం పునః ప్రతిష్ట సందర్భంగా వచ్చే భక్తులకు వసతులలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా అందరూ తగిన జాగ్రత్త తీసుకోవాలి అన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పని చేసి ఈ దైవ కార్యాన్ని విజయవంతం చేయాలి అన్నారు.
భక్తుల కోసం భోజన, తాగునీరు వసతులు కల్పించినట్లు తెలిపారు.
రిజర్వాయర్ లో పడవ ప్రయాణం కూడా ఉందని, భక్తులు కుటుంబంతో వచ్చి శివుణ్ణి దర్శించుకుని, సరదాగా బోటింగ్ చేయవచ్చన్నారు. బోటింగ్ వసతులను పరిశీలించారు.
వేలాది గా తరలి వచ్చే భక్తుల వాహనాల కోసం కావల్సినంత పార్కింగ్ వసతి కల్పించినట్లు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు.
పర్వతగిరి గ్రామం నుంచి శివాలయం వరకు రవాణా సదుపాయం ఏర్పాటు చేశాం అన్నారు.
వృద్దులు, వికలాంగులు గుట్ట మీదకు వెళ్లి దర్శించుకునేందుకు వీలుగా వాహనాలు ఏర్పాటు చేశాం అన్నారు.
పునః ప్రతిష్టాపన గొప్పగా ఉండేలా లైట్లు, మొక్కలు, వసతులతో సుందరీకరణ చేశాం అన్నారు.
ఈ కార్యక్రమంలో మూడు రోజుల కార్యక్రమం సమన్వయ కర్త వందేమాతరం రవీందర్ రావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస రావు, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్లేశం, విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఇరిగేషన్ శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ , డి.ఆర్.డి. ఓ సంపత్ రావు, పంచాయతి రాజ్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ శంకరయ్య, జెడ్పీ సీఈఓ సాహితీ మిత్ర, ఆర్డీవో మహేందర్ జి, పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ, డిపిఓ కల్పన, స్థానిక సర్పంచ్ మాలతీ సోమేశ్వర రావు, ఎంపీటీసీలు మాడుగుల రాజు, బొట్ల మహేంద్ర వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.