నేడు సింగరేణి ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ , సత్తుపల్లి ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో బుధవారం సత్తుపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ కొమ్మేపల్లి యు.పి.ఎస్ పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.కొమ్మేపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సింగరేణి సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
Good coverage medam garu namaste.