పోలియో రెండు చుక్కలు పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది
పోలియోను నిర్మూలిద్దాం పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం…
*అన్నారం సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ హాజరై ఐదేళ్ల లోపు బాల బాలికలకు పోలియో చుక్కలో వేయడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిల్లల నిండు జీవితానికి పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమని అన్నారు పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం కోసం పోలియో ను నిర్మూలించాలని అన్నారు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు పోలియో టీకాలు వేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఏం,. ఆశ వర్కర్ లు, అంగన్వాడీ టీచర్లు,పాల్గొన్నారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.