అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.
Adilabadఅంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి, జులై 24 తర్వాత ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.
సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష చెల్లించాలి. vrs సౌకర్యం కల్పించాలి.
అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
తెలంగాణ రాష్ట్రంలో 65 సంవత్సరాలు పూర్తయిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు అంగన్వాడి ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారు. ఈ సమ్మె సందర్భంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ కు 2 లక్షలు హెల్పర్స్ కు 1 లక్ష పెంచుతామని, పెన్షన్ మరియు విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అనంతరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ ఉద్యోగుల స్థితిగతులు, గత 24 రోజులు సమ్మె జరిగిన పరిస్థితి, ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హామీల్లో ఒకటైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి కూడా వివరంగా ప్రభుత్వం ఐసీడీఎస్ మంత్రి మరియు ఐసీడీఎస్ రాష్ట్ర అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువచ్చాము. అయినా పై అంశాలను పరిగణలోకి తీసుకోక పోవడం అన్యాయం. పైగా రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మనోభావాలకు వ్యతిరేకంగా, ఏకపక్షంగా అతి తక్కువ డబ్బులు చెల్లించి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ను జులై 4 తర్వాత ఇంటికి పంపించాలని నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గం. అంగన్వాడీ ఉద్యోగులకు తీవ్రమైన నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు ముందు గత బిఆర్ఎస్ ప్రభుత్వం go no 10 ని జారీ చేసింది. దీని ప్రకారం టీచర్స్ కు 1 లక్ష, హెల్పర్స్ కు 50 వేలు ఇస్తామని నిర్ణయం చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ 24 రోజులు నిరవధిక సమ్మె చేశారు. ఈ సమ్మె సందర్భంగా అక్టోబర్ 4న గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇతర హామీలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష పెంచుతామని,vrs సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్రంలో నిరవధిక సమ్మెను విరమించారు. ఈ అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించకుండా పక్కన పెట్టడం సమంజసం కాదు.పైగా అంగన్వాడీ ఉద్యోగులు వ్యతిరేకించిన పాత go no 10 నీ అమలు చేయాలని చూడటం అన్యాయం.
పాత go no 10 ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారంలో సర్క్యులర్ ను జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు పోరాటాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం జూన్ 7 న ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో అంగన్వాడీ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ డైరెక్టర్ గారితో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఐసిడిఎస్ డైరెక్టర్ గారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కోరుకుంటున్న విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని,vrs సౌకర్యం కల్పించాలని,అంగన్ వాడీ ఉద్యోగులకు సానుకూలంగా ప్రభుత్వానికి ఫైల్ పెడతామని ఐసీడీఎస్ డైరెక్టర్ గారు హామీ ఇచ్చారు. జూన్ 17న ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారు మహబూబాబాద్ జిల్లా వెళ్లిన సందర్భంగా అక్కడ అంగన్వాడి యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రి గారిని కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష పెంచుతూ సంతకం చేశానని మంత్రిగారు తెలియజేశారు. ఐసిడిఎస్ రాష్ట్ర అధికారులతో పాటు,మంత్రిగారు కూడా సానుకూలంగా స్పందించడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయని, విఆర్ఎస్ సౌకర్యం వస్తుందని రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ , హెల్పర్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మళ్లీ పాత go no 10 ప్రకారం అతి తక్కువ డబ్బులు చెల్లించి జూలై 24 తర్వాత ఇంటికి పంపిస్తామని నిర్ణయం చేయడం అంటే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ ,హెల్పర్స్ ను మోసం చేయడం తప్ప మరొకటి కాదు.
కావున అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ కు నష్టం కలిగించే go no 10ని రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష పెంచుతూ కొత్త జీవో ను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (citu ) రాష్ట్ర అధ్యక్షురాలు కే.సునీత జిల్లా అధ్యక్షురాలు D వెంకటమ్మ నాయకులు D సునీత CITU రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ నాయకులు యాటల సోమన్న CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆశన్న అన్నమొల్ల కిరణ్ పాల్గొన్నారు.