ఉట్నూర్// ఈ రోజు ఆదివాసి సేన ఉట్నూర్ మండల నాయకుల సమావేశం మండలంలోని బాబాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ముసల పాడ్ గ్రామంలో ఆదివాసి సేన ఉట్నూర్ మండల కన్వీనర్ ఆత్రం రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదీ.03-09-2023 ఆదివారం రోజున గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించే ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఎన్నికలకు ఉట్నూర్ మండల ఆదివాసులు అధిక సంఖ్యలో హాజరై ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఎన్నికలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన మండల నాయకులు మేస్రం వినాయక్ రావు,ఆత్రం పాండురంగ,మేస్రం బాధిరావు, ఆత్రం రాజు,కోట్నక్ ఇస్రు, ఆత్రం చత్రుఘన్, ఆత్రం రాసికూమర్,ఆర్క శ్రీనివాస్,కోట్నక్ తులిసిరాం, తదితరులు పాల్గొన్నారు