
ఈ69న్యూస్ హనుమకొండ మార్చి 24హసన్పర్తి మండల పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు, పై అధికారుల పర్యవేక్షణలో మొత్తం 12 సైన్ బోర్డులు/హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇందులో భాగంగా, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న హనుమకొండ–కరీంనగర్ నేషనల్ హైవే రోడ్డుపై 8 హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా హనుమకొండ నుంచి అంబాల వెళ్లే రోడ్డులో 2 బోర్డులు, ORR వంగపాడు సమీపంలో మరో 2 హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ బోర్డుల ప్రధాన ఉద్దేశం వాహనదారులు అప్రమత్తంగా ఉండి, వేగాన్ని తగ్గించి సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రోత్సహించడం. దీంతో ప్రమాదాలను తగ్గించడంతో పాటు, వాహనదారులు తమ గమ్యస్థలాలకు సురక్షితంగా చేరుకోవడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.