
సుత్తీ కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటేద్దాం
సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనగామ నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పేరు ప్రకటించడం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఎం జనగామ నియోజకవర్గం అభ్యర్థి మోకు కనకారెడ్డి జనగామ ఆర్టీసీ చౌరస్తా వద్దగల అంబేద్కర్ విగ్రహనికి పూలమావేయడంతో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున బాణాసంచా పేల్చడం జరిగింది. అనంతరం అభ్యర్థి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ జనగామ గడ్డకు ఘనమైన పోరాట చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తిని పనికిపుచ్చుకొని జనగామలో కార్మిక, రైతు, యువజన, విద్యార్థి, మహిళల సమస్యలతోపాటు నియోజకవర్గం అభివృద్ధికై అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత సిపిఎం పార్టీకి ఉందన్నారు.
జనగామ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సుత్తేకోడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జనగామ ప్రాంతం అభివృద్ధిలో ఆమడదూరం ఉందని దీనికి కారణం పాలకులేనని అన్నారు. జనగామ ప్రజా సమస్యలపై, జనగామ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక గల ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అని అన్నారు. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే ఎజండగా పనిచేస్తూ అలుపెరుగనిపోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థినైనా నన్నుఆదరించి సిపిఎం గుర్తు సుత్తేకోడవలి నక్షత్రంపై ఓటువేసి భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, పార్టీ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, పోత్కనూరి ఉపేందర్, భూక్యా చందు, ఎండి ఆజారోద్దిన్, బోడ నరేందర్. బిట్ల గణేష్, మండల కార్యదర్శి గంగాపురం మహేందర్, పట్టణ కమిటీ సభ్యులు బోట్ల శ్రావణ్, కళ్యాణం లింగం, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దాడిదే సందీప్, పార్టీ నాయకులు ఆర్. మిట్యా నాయక్, పోత్కనూరి కనకచారి, కొండ వరలక్ష్మి, గంగరబోయిన మల్లేష్ రాజ్, బి. విష్ణు పాము శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.