ముప్పారం గ్రామంలో అగ్ని ప్రమాదం
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తను కాల్చడంతో మంటలు చెలరేగి,అవి పక్కనే ఉన్న గ్రామపంచాయతీ ట్రాక్టర్కు వ్యాపించి.ట్రాక్టర్ ముందు టైర్ ఒకటి, వెనుక టైర్ ఒకటి కాలిపోయాయి.ప్రమాదాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం.అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.