ప్రచార హోరు 14 వ వార్డులో కాంగ్రెస్ జోరు
ఈరోజు మరిపెడ మున్సిపాలిటీ 14వ వార్డులో జాటోత్ సురేష్ తల్లిదండ్రుల, తల్లి ఆశీర్వాదం తీసుకొని పెద్ద సంఖ్యలో మహిళలతో,పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలను చేతి గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.వార్డు అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.వార్డు ప్రజల కోసం పాలకునిగా కాకుండా సేవకునిగా పనిచేస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది అని పేద బడుగు బలహీన వర్గాలకు సమూచిత న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు,14 వ వార్డు ఓటర్లు అందరు కలిసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని, స్థానిక ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ ఆశీస్సులతో 14 వ వార్డుని అభివృద్ధి పథంలో తీసుకుపోతానని మాటిచ్చారు, 14 వార్డు ఓటర్ల ను చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమం లో మహిళ నాయకులు రాధికా, యూత్ నాయకులు వెంకట సాయి,యాకయ్య,ముల్క అనివెష్,శ్రీను,రాజ్దీప్,వినోద,శాంతమ్మ,ఇద్దమ్మ,జ్యోతి, ఉపేంద్ర,సింధు,బిందు తదితరులు పాల్గొన్నారు.