
మంద శ్రీకాంత్ SFI హనుమకొండ జిల్లా కార్యదర్శి
పేద విద్యార్థుల జీవితాలతో చేలగటమాడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి
మంద శ్రీకాంత్
SFI హనుమకొండ జిల్లా కార్యదర్శి
తెలుగు గళం న్యూస్,హన్మకొండ, అక్టోబర్ 24
ఈనెల 30వ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బందును విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం రోజున హనుమకొండ నగరంలోని రామ్ నగర్ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి గద్దనెక్కారని అన్నారు. గత మూడు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 8,150 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదివే విద్యార్థులకు సర్టిఫికెట్స్ తీసుకుందామంటే ప్రభుత్వం నుండి డబ్బులు రాలేదని విద్యా సంస్థల యజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. గత నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పిజి కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు రాష్ట్రంలో బందుకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపి,1200 కోట్ల రూపాయలను రెండు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మోసం చేసిందన్నారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యరంగ సమస్యలపై అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ను మరియు ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పీజీ కళాశాలలు మరియు ఇంజనీరింగ్ కళాశాలలు యూనివర్సిటీలు బందుకు పిలుపునివ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ బందులో విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జస్వంత్,జిల్లా కమిటీ సభ్యులు చెన్నూరి సాయికుమార్,పవన్ కుమార్, సూరజ్ రాహుల్,రణదీప్, అరుణ్ కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.