ఆంధ్ర ప్రాంతం సీలేరు నుండి అక్రమంగా 87 కేజీల గంజాయిని స్విఫ్ట్ డిజైర్ కారులో మహారాష్ట్ర వైపు తరలిస్తుండగా దాచాపురం ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్న వైరా పోలీసులు. ఇద్దరు నిందితుల వద్ద నుండి సుమారు RS. 17,00,000/- గంజాయి మరియు ఒక స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు. పట్టుబడ్డ నిందితులు ఆంగోతు నాగరాజు, ధరావత్ కృష్ణ ఇద్దరూ లాల్ సింగ్ తండా, సూర్యాపేట జిల్లాకు చెందినవారు.మరొక కారులో ముగ్గురు నిందితులు సుమారు 25 కేజీల గంజాయితో పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన నిందితులని అరెస్టు చేసి రిమాండ్ కి పంపిస్తున్నట్లు వైరా సీఐ తెలిపారు.