అంతర్జాతీయ అక్షర దినోత్సవ సందర్భంగా పోషణ మాసంలో భాగంగా మరిపెడ మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ లో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ శిరీష,మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూర రవి పాల్గొని మునావర్ వర్షిత్ కు అక్షరాభ్యాసం చేశారు.అలాగే అంగన్వాడి సెంటర్ లోని పిల్లలకు కూడా అక్షరాభ్యాసం చేసి నేటి బాలలే రేపటి పౌరులని,భవిష్యత్తులో ఉన్నంత విద్యను అభ్యసించి గొప్ప ప్రయోజకులుగా కావాలని ఆశీర్వదించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డల ఆరోగ్య సంక్షేమం కోసం పౌష్టికారమైన ఆహారాన్ని అందిస్తుందన్నారు.గర్భిణీ స్త్రీలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే పుట్టబోయే పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు.అంగన్వాడి సెంటర్ లో గుడ్లు,పాలు, బాలామృతం,ఆకుకూరలు అందజేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించారన్నారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రసూతి సహాయంగా మగబాబు పుడితే 12 వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలను అందజేస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా గర్భిణీ స్త్రీలను గాని,ప్రజలను గాని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు.మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక దావఖానాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,ఆయాలు,గర్భిణీ స్త్రీలు,చిన్నపిల్లల తల్లులు పాల్గొన్నారు.