అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానికేతరులైన అనర్హులకు కేటాయించి పేదలను మోసం చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగుడ మున్సిపాలిటీలో స్థానికులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని స్థానికులు చేస్తున్న ధర్నాకు ఆదివారం ఆయన మద్దతు తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోత్బలంతో స్థానికులకు అన్యాయం చేస్తూ,స్థానికేతరులకు ఇండ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. తుక్కుగూడ పరిధిలో ఫేస్ -I కింద 10 ఎకరాల భూములో 832 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, ఫేస్ -II కింద 12 ఎకరాల్లో 2016 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి స్థానికులకు అన్యాయం చేస్తూ, స్థానికేతరులకు కేటాయించారు. భూములు కోల్పోయింది స్థానికులైతే,మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం స్థానికేతరులకు ఇండ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. బడంగ్ పేట్ లో పేదల భూములను గుంజుకొని, భూములు కోల్పోయిన బాధితులకు కేవలం 60 గజాల స్థలాన్ని కేటాయించి అన్యాయం చేసిందని మంత్రిని విమర్శించారు. తక్షణమే డబుల్ బెడ్ రూం ఇండ్లను స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేసారు. తమ న్యాయమైన డిమాండ్ కోసం ధర్నా చేస్తున్న స్థానికులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.హైదరాబాద్ చుట్టూ ఉన్న పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకొని ఇండస్ట్రియల్ పార్కులకు కేటాయిస్తున్నారని విమర్శించారు.తుక్కుగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ జరిపి స్థానికులకే ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ధర్నాలో పాల్గొన్న వారిలో రంగారెడ్డి తూర్పు, పడమర జిల్లా అధ్యక్షులు పంది లింగం,రాచమల్ల జయసింహ,గుడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్తె తెలంగాణలో దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కొనియాడారు.చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం తుక్కుగూడలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణలోని బహుజనుల ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక అని అన్నారు.ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తితో తెలంగాణలో దొరల గడీల పాలనను కూల్చి, బహుజన రాజ్యం నిర్మించేందుకు బహుజనులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.