ఖమ్మంజిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఏసీపీ రామానుజన్ ఆధ్వర్యంలో పార మిలిటరీ బలగాలు గురువారం రాత్రి తల్లాడ మండలంలో కవాతు నిర్వహించారు. కేశవాపురం, మిట్టపల్లి, అన్నారుగూడెం, బిల్లు పాడు గ్రామాల్లో ఈ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో పారా మిలటరీ బలగాలు ప్రత్యేక కవాతు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, ప్రతిఒక్కరు ఓటు వేసేందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు కవాతును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సత్తుపల్లి సిఐ , తల్లాడ ఎస్సై పి. సురేష్ కల్లూరు ఎస్సై రఘు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News