నాగర్ కర్నూల్ ఘటనపై ఐద్వా నిరసన
బుధవారం సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఎం అనుబంధ అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఘటనపై ప్లకార్డులు చేతభూనీ నిరసన చేపట్టారు.కొమ్మర మల్లన్న జాతరకు వెళ్ళి దైవ దర్శనానికి వెళ్లిన రజక కుటుంబం పై అగ్రకుల పెద్దలు దాడి చేసి పసికందును కాళ్ళతో తన్ని నేలకోసి కొట్టి చిన్నారి మరణానికి కారణమైన దోషులను కఠినoగా శిక్షించాలని ఐద్వా డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కుల,మత,వర్ణ,లింగ భేదాల ద్వేషాలను ప్రభుత్వం ప్రోత్సహించడం సరి కాదని ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో:శీలం కరుణ, రాయల రాణిరుద్రమదేవి, నాగమణి,పుష్పవల్లి తదితరులు పాల్గొన్నారు.