గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని దాసర్ పల్లి గ్రామ ఉపసర్పంచ్ చిన్న భీమన్న,బిజ్వారం ఆశన్న,మాజీ ఉపసర్పంచ్ దేవన్న లతో కలిసి మాజీ ఎంపిపి తమ్ముడు వై.శ్రీనివాస్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతయ్య అధ్వర్యంలో బిజ్వారం,దాసర్ పల్లి,ఉలిగేపల్లి గ్రామాల బిఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్లతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో 200 మంది కాంగ్రెస్ పార్టీలో భారీ స్థాయిలో చేరారు… చేరిన వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి నాయకులను,ప్రజాప్రతినిధులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు..మల్దకల్ మండలంలో మంచి పాటు ఉన్న నాయకుడు వై.శ్రీనివాస్ రెడ్డి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల అభినందనలు తెలిపారు… గద్వాల గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందు గాను సమిష్టిగా ముందుకు పోవాలని సూచించారు…పార్టీలో చేరిన వారు వార్డ్ మెంబర్స్ దేవమ్మ హన్మంతు, ఆర్,రాజారెడ్డి, డి.సత్యరెడ్డి,కృష్ణమూర్తి, యుత్ అధ్యక్షుడు టి.ముర్తి,నర్సన్న గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దుబ్బన్న,సంతోష్ నాయుడు, కర్రెన్న,లక్ష్మణ,ఆటో తిమ్మప్ప, సి.ఎం సవారన్న, ఆంజనేయులు,నాగేంద్ర, సవారప్ప తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు