బోడ కవిత రమేష్ నాయక్ నామినేషన్ దాకలు
మరిపెడ ఎంపీడీవో కార్యాలయంలో రెండవ రోజు నామినేషన్ వేయడం జరిగింది, పదో వార్డు ఎస్టి మహిళ రిజర్వేషన్ కావడంతో కవిత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోడ కవిత రమేష్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు,ఈ సందర్భంగా బోడ కవిత రమేష్ నాయక్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల కాలం నుండి మాకులతండ ప్రజలకు ఎన్నో రకాలుగా సహాయం చేయడం జరుగుతుంది అన్నారు,వాటిలో భాగంగా మాకుల తండలో అనారోగ్య కారణంగా చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం మరియు ఎన్నో కుటుంబాలకు నిత్యవసర సరుకులు బియ్యం ఇవ్వడం జరిగింది హాస్పటల్లో ప్రాణాపా స్థితిలో ఉన్న ప్రజలకు 15 సార్లు రక్తదానం చేయడం జరిగింది. హాస్పటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది కరోనా మహమ్మారి సమయంలో 75 కుటుంబాలకు నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది 15 సంవత్సరా మాకులతండ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుండి తన వంతుగా సహాయం చేస్తున్నారు మాకులతండ స్కూల్ పిల్లలకు గతంలో నోట్ బుక్స్ ప్లేట్స్ పలకలు అన్ని పంపిణీ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే గత 15 సంవత్సరాల నుండి ఎన్నో మంచి కార్యక్రమాలు బోడ కవిత రమేష్ నాయక్ చేశారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలందరూ దీవించి పదో వార్డు నుండి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి వ్యక్తి మాకుల తండలో పుట్టడం మాకులతండ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తానని అందరి ముందు మాట ఇవ్వడం జరిగింది గుగులోతు చందు నాయక్ బోడ రవి నాయక్,ఇస్లావత్ బాలనాయక్,బానోతు ప్రకాష్,బోడ అనిల్ కుమార్,బోడ తరుణ్, తదితరులు పాల్గొన్నారు