మత సామరస్యానికి రేవంత్ సర్కారు పెద్దపీట ఎమ్మెల్యే మట్టా
ముస్లింలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిదయానంద్ తెలిపారు.బుదవారం సత్తుపల్లి పట్టణంలోని పాత సెంటర్ లో గల మసీదు లో రంజాన్ తోఫా ను ముస్లిం లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాగమయి అందించారు.చీరలు,లాల్చీ లు బహుకరించారు.
మైనారిటీల సంక్షేమానికి,మత సామరస్యానికి రేవంత్ రెడ్డి సర్కారు పెద్ద పీట వేసిందని స్పష్టం చేశారు.ముస్లిం పెద్దలు మట్టా కు కృతజ్ఞతలు తెలిపారు.రాగమయి కు శాలువకప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో: తహశీల్దార్,పురపాలక సంఘం చైర్మన్ మహమ్మద్ రెహానా బేగంకమల్ పాషా,వైస్ చైర్మన్ బొంతు సుమలత,మున్సిపల్ కౌన్సిలర్స్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు,సీనియర్ నాయకులు చల్లగళ్ళ నరసింహారావు, చల్లగుళ్ల కృష్ణయ్య,గ్రాండ్ మౌలాలి, షరీఫ్,హకీమ్ తదితరులు పాల్గొన్నారు.