మున్సిపాలిటీ లో బోణి కొట్టిన నామినేషన్
టీడీపీ,జనసేన తరుపున నామినేషన్ దాకలు చేసిన బోడ స్వాతి దామోదర్ నాయక్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ,జనసేన పార్టీ తరఫున మరిపెడ మున్సిపాలిటీలో ఆరో వార్డు నుండి బోడ స్వాతి దామోదర్ నాయక్ తొలినామినేషన్ దాఖలు చేశారు,అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు,వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను స్వీకరించి, అవసరమైన పత్రాలను సమర్పించి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి,జనసేన రాష్ట్ర నాయకులు బోడ నాగేశ్వరావు,బోడ రాంబాబు,బోడ విజయ్, పీకులు,చంటి, రాంకీ, విజయ్, మోహన్,వాసు,బోడ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.