సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నేటి నుండి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలు జరగకుండా ఆపాలని ఏబీవీపీ గుండాలు ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై దాడిని ఖండిస్తూ మండల కేంద్రంలో దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ ఎదుగుదల ఓర్వలేని మతోన్మాద ఎబివిపి ఈ సమావేశాలు అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికతో కర్రలతో, రాళ్ళతో దాడి చేశారు. ప్లీనరీ ఎర్పాట్లులలో జెండాలు,బ్యానర్స్ కడుతుంటే కావాలని గోడవ సృష్టించి రాళ్ళతో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ పై దాడి చేశారు. రమేష్ తో పాటు జిల్లా నాయకత్వం పై తీవ్రంగా దాడిచేశారు.సామాన్య ప్రజలను సైతం బెంబేలెత్తించారు,పార్క్ చేసిన ఆటోను సైతం ధ్వంసం చేశారు. రమేష్ పై రాళ్ళతో దాడి చేసి తలపగలగోట్టారు. విద్యార్ధి సంఘం పేరుతో ఎబివిపి ఆరాచకాలు సృష్టిస్తుంది. విద్యార్ధి సమస్యలపై చేతనైతే పోరాడాలి, కానీ పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ పై దాడి చేసి ఎదుగుదలను అడ్డుకోవాలని అనుకుంటే చరిత్రలో ఎం జరిగిందో ఎబివిపి తెలుసుకోవాలి. సమాజంలోప్రజలకోసం పని చేసే వారిని తయారు చేయాలి ,కానీ ఆరాచకలు సృష్టించేవారిని కాదు. దీనితోపాటు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ తెలపగల కొట్టడం జరిగింది. అడ్డుకున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మొత్తాన్ని కూడా ఏబీవీపీ కుండాలు అమ్మాయిలను కూడా చూడకుండా కొట్టడం జరిగింది. ఎబివిపి ఎస్ఎఫ్ఐ నాయకులపై చేసిన ఈ దాడిని ప్రజాస్వామిక వాదులు, మేథావులు, అభ్యుదయ శక్తులు ఖండించాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుంది.ఆరాచకం సృష్టిస్తున్న ఎబివిపి గుండాలను శిక్షించాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తమ అస్థీత్వం కాపాడుకోవడం కోసం ఎబివిపి ఇలాంటి దాడులు చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు బోడా అభిమిత్ర మండల కార్యదర్శి జెమ్మి యస్వంత్ నాయకులు పవన్ కళ్యాణ్ సాయి నవీన్ అనిల్ తేజ ప్రవీణ్ వెంకటేష్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.