ఎంఈఓను సన్మానించిన ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు…. తల్లాడ సెప్టెంబర్ 05, ... స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అధ్యక్షతన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం మండల పరిషత్ సమావేశ మందిరము నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దామోదర్ ప్రసాద్ మరియు మండల పరిధిలో వివిధ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.. అనంతరం ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని దానాల కంటే విద్య దానం మహా గొప్పదని మనిషి యొక్క జీవన శైలిని,సరళిని పెంపొందించేది విద్య మాత్రమే నని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ ఉపాధ్యాయ దినోత్సవం భారత ఉపరాష్ట్రపతి, భారతరత్న బిరుదాంకితుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహించడం నిజంగా విద్యకున్న మూలాలను,దాని యొక్క ఉన్నతిని గుర్తించి, గౌరవించడానికి నిదర్శనంగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు అనంతరం ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అధ్యక్షతన మండలంలో పలు అంశాలపై జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపం జరగకుండా చూడాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు… ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొండపల్లి శ్రీదేవి,ఎంఈఓ దామోదర్ ప్రసాద్,ఏవో తాజుద్దీన్,ఈవో ఉమా వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు,మండల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,వివిధ శాఖల అధికారులు,సహచర ఉద్యోగులు పాల్గొన్నారు...