రానున్న సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు,బంధువుల ఇళ్లకు ప్రయాణించనున్న నేపథ్యంలో,ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, కాలనీలు, ఒంటరిగా ఉన్న ఇళ్ల పరిసరాల్లో పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేశామని తెలిపారు.రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ప్రజలు ప్రయాణానికి వెళ్లే ముందు ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవాలని,నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని సూచించారు.అలాగే పొరుగువారు, గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వడంతో పాటు, అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్కు ముందుగానే తెలియజేయడం ద్వారా అదనపు భద్రత పొందవచ్చని తెలిపారు.సంక్రాంతి సెలవుల సమయంలో చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ఇళ్లలోకి చొరబడి నేరాలకు పాల్పడే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు.గతంలో నేరాలు నమోదైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వీధి దీపాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలని, సీసీటీవీ కెమెరాలు ఉన్న వారు అవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదో పరిశీలించుకోవాలని సూచించారు.అపరిచిత వ్యక్తులు ఇళ్ల చుట్టూ తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.అలాగే పండుగల సమయంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంతో పాటు వాహనాలకు తాళాలు సరిగా వేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.సంక్రాంతి పండుగల సమయంలో జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే డయల్–100కు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.ప్రజల అప్రమత్తత,పోలీస్ శాఖ సహకారంతో జిల్లా వ్యాప్తంగా నేరరహిత వాతావరణంలో శాంతియుతంగా,సురక్షితంగా సంక్రాంతి పండుగలను జరుపుకోవచ్చని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ పేర్కొన్నారు.
ప్రజలకు పలు సూచనలు చేసిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్
రానున్న సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు,బంధువుల ఇళ్లకు ప్రయాణించనున్న నేపథ్యంలో,ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, కాలనీలు, ఒంటరిగా ఉన్న ఇళ్ల పరిసరాల్లో పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేశామని తెలిపారు.రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ప్రజలు ప్రయాణానికి వెళ్లే ముందు ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవాలని,నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని సూచించారు.అలాగే పొరుగువారు, గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వడంతో పాటు, అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్కు ముందుగానే తెలియజేయడం ద్వారా అదనపు భద్రత పొందవచ్చని తెలిపారు.సంక్రాంతి సెలవుల సమయంలో చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ఇళ్లలోకి చొరబడి నేరాలకు పాల్పడే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు.గతంలో నేరాలు నమోదైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వీధి దీపాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలని, సీసీటీవీ కెమెరాలు ఉన్న వారు అవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదో పరిశీలించుకోవాలని సూచించారు.అపరిచిత వ్యక్తులు ఇళ్ల చుట్టూ తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.అలాగే పండుగల సమయంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంతో పాటు వాహనాలకు తాళాలు సరిగా వేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.సంక్రాంతి పండుగల సమయంలో జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే డయల్–100కు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.ప్రజల అప్రమత్తత,పోలీస్ శాఖ సహకారంతో జిల్లా వ్యాప్తంగా నేరరహిత వాతావరణంలో శాంతియుతంగా,సురక్షితంగా సంక్రాంతి పండుగలను జరుపుకోవచ్చని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ పేర్కొన్నారు.